గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించినా సరే అంచనా వేసిన వంద స్థానాలను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. ఇప్పటి వరకు 47 స్థానాల్లో తెరాస పార్టీ విజయం సాధించింది. 33 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. 39 స్థానాల్లో మజ్లీస్ పార్టీ విజయం సాధించింది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎక్స్ అఫీషియో ఓట్లతో తెరాస  పార్టీ మేయర్ కైవసం చేసుకుంది.

మేయర్ గా భారతీ నగర్ నుంచి రెండో సారి విజయం సాధించిన సింధూ ఆదర్శ్ రెడ్డిని సిఎం కేసీఆర్ ఎంపిక చేసారు. ఆమెను ప్రగతి భవన్ కి సిఎం కేసీఆర్ ఆహ్వానించారు. డిప్యూటీ మేయర్ గా బొరబండ నుంచి రెండు సార్లు విజయం సాధించిన బాబా ఫసియుద్దిన్ ని ఎంపిక చేసారు. ఆయన గతంలో కూడా డిప్యూటి మేయర్ గా పని చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: