ఐసీసీ ఇటీవ‌ల కొత్త‌గా ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌లో అన్ని ర‌కాల ఫార్మాట్ల‌లో క‌లిపి ఎవ‌రు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేశారో వారికి ఈ అవార్డు ఇస్తారు. తాజాగా ఫిబ్రవ‌రి నెల‌కు సంబంధించి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్‌ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. భార‌త ఆలౌరౌండ‌ర్ ర‌విచంద్ర అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌, విండీస్ ప్లేయ‌ర్ కైల్ మేయ‌ర్స్ ఉన్నారు. ఐసీసీ వెబ్‌సైట్ ఓటింగ్ ద్వారా మార్చి 8న అవార్డు ఎవ‌రికి వ‌స్తుందో ప్ర‌క‌టిస్తారు.

విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ నామినేట్‌ కావడం ఆసక్తి కలిగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మేయర్స్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో(210 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. ఈ ఫీట్‌ను మేయర్స్‌ మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అందుకోవడం విశేషం. మహిళా క్రికెటర్లలో ఇంగ్లండ్‌ నుంచి టామీ బ్యూమాంట్ ,నాట్ సైవర్, బ్రూక్‌ హిల్లాడే ( న్యూజిలాండ్‌) అవార్డుకు ఎంపిక‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: