ఏపీలో జ‌రుగుతోన్న వ‌రుస ఎన్నిక‌ల‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నిక‌ల్లో ఏ చిన్న అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగినా నిమ్మ‌గ‌డ్డ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తాజాగా ఆయ‌న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ  ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుపతిలోని ఏడో వార్డు ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ నిలిపివేశారు. తన నామినేషన్ ఫోర్జరీ సంతకంతో ఉపసంహరించారని ఆ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి ఫిర్యాదుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. దీంతో ఆ ఎన్నికను సస్పెండ్ చేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్ర‌క‌టించారు. తిరిగి ఈ డివిజ‌న్ ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: