ఏపీ ముఖ్యమంత్రి జగన్రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? మదమా? కొవ్వా? అర్థం కాకుండా ఉందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకుండా మొద్దునిద్రపోతున్నాడంటూ మండిపడ్డారు. గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, దొరికినచోటల్లా అప్పులు చేస్తున్నారని, ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదని, సీపీఎస్ అతీగతీ కుండా పోయిందంటూ విమర్శించారు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయిందని, పాలనానుభవం లేకపోవడంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడంటూ మండిపడ్డారు. నాపై రాళ్లు వేసి నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే... ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారని, ఎన్నడూ జరగని సంఘటనలు ఈ రెండేళ్లలో ఏపీలోనే జరిగాయనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? మదమా? కొవ్వా? అర్థం కాకుండా ఉందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకుండా మొద్దునిద్రపోతున్నాడంటూ మండిపడ్డారు. గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, దొరికినచోటల్లా అప్పులు చేస్తున్నారని, ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదని, సీపీఎస్ అతీగతీ కుండా పోయిందంటూ విమర్శించారు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయిందని, పాలనానుభవం లేకపోవడంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడంటూ మండిపడ్డారు. నాపై రాళ్లు వేసి నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే... ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారని, ఎన్నడూ జరగని సంఘటనలు ఈ రెండేళ్లలో ఏపీలోనే జరిగాయనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.