ప్రస్తుతం సమాజంలో మానవత్వం కనుమరుగు అవుతున్న సమయంలో ఆ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారికీ కష్ట సమయంలోను తోడుగా నిలుస్తున్నారు. పోలీసుల్లో కర్కశత్వమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించారు కరీంనగర్ జిల్లా పోలీసులు.. కఠినంగా ఉండటమే కాదు.. మంచి మనసు ఉంటుందని చాటుకున్నారు.  కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన యాంసాని సంపత్ కరోనా బారిన పడి గ్రామ శివారులో మృతి చెందారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు తల్లి, తమ్ముడు, సోదరి సైతం కరోనా బారిన పడడంతో ఎవ్వరు మృతదేహం పట్టుకోడానికి ముందుకురాలేదు. విషయం తెలిసిన ఎస్ఐ ప్రవీణ్ రాజ్, ట్రైనీ ఎస్ఐ రజనీకాంత్ ఇద్దరూ అక్కడికి చేరుకొని దుప్పటిలో సంపత్ మృతదేహాన్ని మూటకట్టి ట్రాలీ ఆటో ద్వారా తరలించారు. అంతేకాకుండా అనంతరం తమ స్వంత ఖర్చులతో అంతిమ సంస్కారం పూర్తి చేశారు. ఇద్దరు ఎస్సైలు చూపిన ఔదార్యాన్ని చూసి గ్రామస్థులతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, సిపి కమలాసన్ రెడ్డి వారిని అభినందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: