దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. కరోనాతో వందలాది మంది చనిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఒక వింత ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా వైరస్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కూడా మనుషుల్లాంటి జీవేనని అన్నారు. మనలాగే కరోనా కూడా బ్రతకడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. త మనందరిలాగే కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందని త్రివేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. కాగా ఆయన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు త్రివేంద్ర సింగ్ రావత్ ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: