ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు గ‌త కొన్ని నెల‌లుగా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్ షిఫ్ ఫైన‌ల్ తొలి రోజు నిరాశ ప‌రిచింది. తొలి రోజు ఆట అంతా వ‌రుణుడే ఆడేశాడు. రెండో రోజు అయినా ఆట ప్రారంభ మ‌వుతుందా ? అన్న సందేహాల నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా ఉండ‌డంతో ఆట ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కీవిస్ సార‌థి కేన్ విలియ‌మ్స‌న్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో భార‌త్ ముందుగా బ్యాటింగ్ చేయ‌నుంది. ఏదేమైనా రెండో రోజు మ్యాచ్ ప్రారంభం కావ‌డంతో క్రికెట్ ప్రేమికులు టీవీల‌కు అతుక్కుపోయి మ్యాచ్ చూడ‌నున్నారు. ముందు భార‌త్ బ్యాటింగ్ కావ‌డంతో అప్పుడే ఎవ‌రు ఎలా ? ఆడ‌తార‌న్న దానిపై చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. భార‌త్ ముగ్గురు పేస‌ర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగ‌నుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: