న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా కీలక వికెట్లు కోల్పోయింది. ముందు రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన ఇండియా ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్ వికెట్ కోల్పోయింది. ఇక వారి తర్వాత వచ్చిన కోహ్లీ, పుజారా ఇద్దరూ కూడా ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు. పుజారా నిలబడినట్టే నిలబడి వికెట్ చేజార్చుకున్నాడు.

పేస్ బౌలింగ్ ని సమర్ధంగానే ఎదుర్కొన్నా సరే న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌల్ట్ విసిరిన బంతి ఇన్ స్వింగ్ కావడంతో పుజారా ఎల్బీడబ్ల్యూ గా వెనుతిరిగాడు. అయితే రివ్యూ కి వెళ్లాలని భావించినా సరే కోహ్లీ వద్దని చెప్పడంతో పుజారా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోయాడు. పుజారా తర్వాత సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్యా రహానే క్రీజ్ లోకి వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: