ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ కాస్త ఇబ్బంది పడుతుంది. దూకుడుగా ఆడలేక కివీస్ బౌలర్ల ధాటికి భారత జట్టు కీలక ఆటగాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యత పుజారా, కోహ్లీ తీసుకున్నా సరే వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత పుజారా అవుట్ కాగా వైస్ కెప్టెన్ రహానే క్రీజ్ లోకి వచ్చాడు.

రహానే కూడా వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక కోహ్లీ టార్గెట్ గా న్యూజిలాద్ బౌలర్ లు బంతులు విసిరారు. అయితే కోహ్లీ మాత్రం ఆత్మ రక్షణలో కనిపించాడు. బంతి ఎక్కువగా స్వింగ్ కావడంతో వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో అతను ఎల్బీ డబ్ల్యూగా జేమిసన్ బౌలింగ్ లో వెనుతిరిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: