ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ లో చేరినప్పటి నుంచి పార్టీలో ముసలం మొదలైంది. కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీతో ఎంతో అనుబంధం ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరి తాను సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ప్రకటించారు. బిజెపి నిర్ణయాలు, విధానాలు నచ్చకనే ఆ నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు స్పష్టం చేశారు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో ఇంచార్జి గా ఉండి పార్టీని గెలిపించిన తనకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని, హుజురాబాద్ ఇంచార్జి గా పనిచేసే అవకాశం రాకపోవడంపై పెద్దిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల భూముల అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న ఈటల రాజేందర్ ను బిజెపిలో చేర్చుకున్న విధానం తనకు నచ్చలేదని స్పష్టం చేశారు. ఇక కేసిఆర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా శిరసావహిస్తానని ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: