కంటోన్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటర్ లో విలీనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల మాదిరిగానే కంటోన్మెంట్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అని ఆయన వివరించారు.

పేద ప్రజలు ఆత్మగౌరవం తో గొప్పగా బ్రతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తెలంగాణ లో తప్ప  దేశంలో ఎక్కడైనా  నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక  కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts