మచిలీపట్నం నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య వాహనాలలో రాజమండ్రికి చేరుకున్నారు. రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలు అధికారులకు పట్టాభిని అప్పగించనున్నట్టు కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. గురువారం విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయాధికారి ఏసీపీ వాదనలతో ఏకీభవిస్తూ పట్టాభికి నవంబర్ 02 వరకు రిమాండ్ విధించారు. పట్టాభి మచీలిపట్నం నుంచి రాజమండ్రికి తరలిస్తున్నారనే విషయం ఉదయం నుంచే ప్రచారం కావడంతో పలువురు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. పట్టాభిని బందోబస్తు మధ్య తీసుకురావడంతో చూడడానికి ఎవరినీ అనుమతించలేదు పోలీసులు.
మచిలీపట్నం నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య వాహనాలలో రాజమండ్రికి చేరుకున్నారు. రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలు అధికారులకు పట్టాభిని అప్పగించనున్నట్టు కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. గురువారం విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయాధికారి ఏసీపీ వాదనలతో ఏకీభవిస్తూ పట్టాభికి నవంబర్ 02 వరకు రిమాండ్ విధించారు. పట్టాభి మచీలిపట్నం నుంచి రాజమండ్రికి తరలిస్తున్నారనే విషయం ఉదయం నుంచే ప్రచారం కావడంతో పలువురు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. పట్టాభిని బందోబస్తు మధ్య తీసుకురావడంతో చూడడానికి ఎవరినీ అనుమతించలేదు పోలీసులు.