కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి రెండు రోజుల‌నుంచి  ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఆయ‌న  ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. వ‌రంగ‌ల్ ఉన్న ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం ఉండాలా ఉండ‌కూడ‌దా..?  నియంత‌ల రాజ్యం ఇంకా కొన‌సాగాలా..?  హుజూరాబాద్ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఏర‌కంగా అధికార దుర్వినియ‌యోగం చేశారో, అధ‌ర్మంగా, ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేకంగా నియంత‌లాగా పూర్తిగా డ‌బ్బుల మీద, అధికారం మీద‌ ఆధార‌ప‌డి ఈరోజు టీఆర్ఎస్ పోటీ చేస్తున్న‌ది. రాజ్యాంగం మీద విశ్వాసం లేని విధంగా ఈ ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను అణ‌చివేసి ఏదో ఒక రకంగా గెల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోందని తెలిపారు.

కుట్ర‌లు, కుతంత్రాల‌కు సిద్ధ‌మైంది టీఆర్ఎస్‌.  హుజూరాబాద్ ప్ర‌జ‌లు దానిని ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్ప‌టికే దుబ్బాక ఉప ఎన్నిక‌లో క‌నిపించింది. హైద‌రాబాద్ కార్పొరేట‌ర్  ఎన్నిక‌ల్లో, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌నిపించింది. హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు మ‌రొక‌సారి అవ‌కాశం వ‌చ్చింది. కుటుంబ ప‌రిపాల‌న‌కు, నియంత పరిపాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పోరాట స్పూర్తికి ఫ‌లితంగా హుజూరాబాద్‌లో ఈట‌ల‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని కోరారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: