క‌లియుగ దైవం అయిన తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి స‌ర్వ‌ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల అయ్యాయి. ఇప్ప‌టికే న‌వంబ‌ర్ నెల‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకులా అమ్ముడు పోయిన విష‌యం విధిత‌మే. డిసెంబ‌ర్ నెల కోటాకు సంబంధించిన  స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను టీటీడీ వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఉద‌యం 9 గంట‌ల‌కు అందుబాటులోకి రావ‌డంతో టికెట్లు భ‌క్తులు టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌డానికి ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచి క్ష‌ణాల్లోనే బుక్ చేసుకుంటున్నారు.

అయితే ఇవాళ స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ రేపు ఆదివారం తిరుమ‌ల వ‌స‌తికి సంబంధించిన టోకెన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంబించిన‌ప్ప‌టి నుంచి ముఖ్యంగా తిరుమ‌లలో ద‌ర్శన  టోకెన్ల‌ను అన్ని ర‌కాలుగా ఆన్‌లైన్‌లోనే ఉంచుతున్నది. గ‌త రెండు నెల‌ల కాలం నుంచి స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతొంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని  శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులు  ముంద‌స్తుగానే టోకెన్లు, వ‌స‌తి బుక్ చేసుకోవాన‌లి కోరుతుంది టీటీడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: