తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా రోశయ్య నివాసానికి చేరుకుంటున్నారు. రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు పలువురు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య రోశయ్య ఇంట్లో పూజలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద నుంచి బయలు దేరి గాంధీ భవన్ కు పార్థివదేహాన్ని తరలించి.. అక్కడ 1 గంటల వరకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తరువాత గాంధీభవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లో ఉన్న మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా రోశయ్య నివాసానికి చేరుకుంటున్నారు. రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు పలువురు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య రోశయ్య ఇంట్లో పూజలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద నుంచి బయలు దేరి గాంధీ భవన్ కు పార్థివదేహాన్ని తరలించి.. అక్కడ 1 గంటల వరకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తరువాత గాంధీభవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లో ఉన్న మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు తెలిపారు.