ఉన్నత
విద్య కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. గతసంవత్సరంతో పోలిస్తే 2022- 23కి 35 శాతం పెరిగిందట.
కరోనా పరిస్థితుల తర్వాత మూడేళ్లుగా క్రమంగా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య... 2022-23 విద్యాసంవత్సరానికి ఏకంగా 2 లక్షల 68 వేల 923కి చేరింది.
అంతర్జాతీయ విద్య సంస్థ.. ఐఐఈ తాజాగా ఓపెన్ డోర్స్ తాజాగా ఈ రిపోర్టును విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న సుమారు పది లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో దాదాపు 25శాతం భారతీయులేనట.
అమెరికాలో 2021-22 విద్యాసంవత్సరంలో లక్ష 99 వేల 182 మంది ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇది గణనీయంగా 35 శాతం పెరిగింది. అందులో అండర్ గ్రాడ్యుయేట్ చదివేందుకు గత విద్యా సంవత్సరంలో 27 వేల 547 మంది వెళ్లారు. ఈ విద్యా సంవత్సరంలో ఇది 16శాతం పెరిగి 31 వేల 954కి చేరిందట. గ్రాడ్యుయేషన్ కోసం 2021 -22 విద్యా సంవత్సరంలో లక్ష 2 వేల 24 మంది వెళ్లారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 62 శాతం పెరిగి లక్ష 65 వేల 936కి చేరిందట.