ఏం చెప్పను ఎలా చెప్పను.. నేటి రోజుల్లో మనుషులు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటు ఉండటం చూస్తూ ఉంటే ఈ ఘటన గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు.. ఏదో కవర్ విప్పి చాక్లెట్ తిన్నట్లుగా.. అరటి తొక్క తీసి పండు తిన్నట్లు గా.. అంత ఈజీగా నేటి రోజుల్లో మర్డర్లు  చేస్తున్నారు. అమ్మో మొన్నటి వరకు మనుషులు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అనుకున్నారు అందరు.. కానీ ఈ ఘటనలు చూస్తే మాత్రం అబ్బే మనుషుల్లో మానవత్వం లేదబ్బా అని అదే మనుషుల అనుకుంటున్నారు. ఏంటో మరి నేటి రోజుల్లో మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారో తెలియటం లేదు కానీ ఒక సొంతమనుషుల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.


 ముఖ్యంగా నేటి రోజుల్లో అయితే భార్య భర్తల బంధం అనేది హత్యలకు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ అయింది. సినిమాల్లో మస్తు చూపిస్తారు.. భార్య భర్తలు అంటే ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటారు.. ఇక ఇవన్నీ చూసి పెళ్లి చేసుకోవాలి అనుకునేవాళ్ళు.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న హత్యలు  చూసి మస్తు పరేషాన్ అవుతున్నరు.. ఇక్కడ జరిగిన ఘటన చూస్తే అరే ఇంత చిన్న కారణానికి కూడా మర్డర్ చేస్తారా.. అని ఆశ్చర్య పోక మానరు. అవునుమరి ఇక్కడ ఒక భర్త చిన్న కారణానికి హత్య చేశాడు.


 సాధారణంగా భర్త స్నానం చేస్తున్న సమయంలో భార్య టవల్ అందించడం చేస్తూ ఉంటుంది. ఇలా భర్త అడిగినప్పుడు భార్య వేరే పనిలో ఉంటే బయటికి భర్తే వచ్చి టవల్ తీసుకోవడం చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం భర్త టవల్ అందించడం కాస్త లేట్ అయింది అన్న కారణంతో భార్య ని చంపేసాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బాలఘాట్ జిల్లా హీరాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అటవీశాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్ కుమార్ స్నానం చేస్తున్న సమయంలో భార్య పుష్పా భాయ్ ని టవల్ అడిగాడు   పనిలో ఉన్నానని కాసేపు ఆగాలి అంటూ చెప్పింది భార్య. ఇక కాసేపు తర్వాత తువ్వాలు అందించింది. అప్పటికే కోపంతో ఊగిపోయిన రాజ్కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య  పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: