వారికి వివాహమై 12 సంవత్సరాలు అవుతుంది. సంసార జీవితం సాఫీగా సాగుతోంది. ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో..ఆ కసాయి భర్త ఆమెను తరచూ వేధింపులకు గురి చేసి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. దేనికోసం హింస తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్న టువంటి భర్త, ఆమె అత్తామామలు పై కరీంనగర్లోని సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం జగిత్యాల జిల్లాలోని రూరల్ మండలానికి సమీపంలో ఉన్న గోపాల్ రావు పేట గ్రామానికి చెందినటువంటి సుమలతకు సారంగాపూర్ మండల కేంద్రంలోని పెంబట్ల గ్రామానికి చెందినటువంటి మిరియాల మహేష్ తో 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సమయంలో వరుడు మహేష్ కు సుమలత తల్లిదండ్రులు వారు ఒప్పుకున్న మొత్తం వరకట్నాన్ని అప్పుడే అప్పజెప్పారు. అయితే ఆ ఇద్దరి దంపతులకు ఇద్దరు కొడుకులు జన్మించారు.
అయితే ఈ మధ్యనే మహేష్ సుమలతను మళ్లీ అదనంగా ఒక మూడు లక్షల రూపాయలు కట్నం తీసుకురావాలని భర్త మహేష్, అత్త పోశవ్వ, మామయ్య లక్ష్మీనారాయణ సుమలతను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన సుమలత వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి