సాధారణంగా మనషుల మనసు ఒక్కోసారి పక్కదారి పడుతుంటుంది. ఈ తరుణంలోనే వాళ్లు తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇక అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఒక్కోసారి తీవ్రమైన నేరాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. కాగా.. కొన్నేళ్ల క్రితం పెళ్లయిన ఈ ఫోటోలోని మహిళ కూడా అలాంటి పనులే చేసింది. ఇక ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఈ మహిళ. అంతేకాదు.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ కూడా వేసుకుంది. ఇక తనకేమీ తెలియదు అన్నట్టుగా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం తెలిపింది. ఇక ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాట్నా సమీపంలోని మసౌదిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మసౌది పోలీస్ స్టేషన్‌కు హడావిడిగా వచ్చిన ఈ మహిళ.. తన భర్తపై ఎవరో హత్యాయత్నం చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోక దిగి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక అక్కడ ఈమె భర్త అజయ్ కుమార్ రక్తపుమడుగులో పడి చనిపోవడాన్ని గుర్తించారు పోలీసులు. అయితే కేసు విచారణను తమదైన స్టయిల్లో చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

దాంతో మరో వ్యక్తి సీన్‌లోకి వచ్చారు. ఆయనే మహ్మద్ నౌషద్. ఇక నౌషద్ కలిసి ఆమె భర్తను హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు రాగా.. వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. అంతేకాక.. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా ? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అన్నది మరింత లోతుగా విచారణ చేస్తే కానీ తెలియదని పోలీసులు వెల్లడించారు.

అంతేకాక.. నిందితుడి హత్యలో మాత్రం అతడి భార్య పాత్ర ఉందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఇక భర్తను హత్య చేసి నిందితురాలు.. కేసు నుంచి తప్పించుకునేందుకు తెలివిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొత్త కథ చెప్పేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఇక కారణం ఏమైనా.. కట్టుకున్న భర్తను మరో వ్యక్తితో కలిసి చంపిన ఈ మహిళ.. కేసు నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం బెడిసికొట్టడంతో.. కాటకాల పాలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: