ఆర్థికంగా లాభపడతాము అనే ఆశతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక మహిళను దారుణంగా నరబలి ఇచ్చారు. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో వెలుగు చూసింది. మహిళల మృతదేహాలను ముక్కలు చేసి వేరువేరు ప్రాంతాల్లో దహనం చేశారు. వీరికి మరొకరు సహాయం చేయగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొచ్చికి చెందిన పద్మ అనే యాభై రెండేళ్ల మహిళ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించగా.. మొబైల్ డేటా చూసుకుంటే మహ్మద్ షఫీతో అనేకసార్లు మాట్లాడినట్లు తేలింది.
అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు మాత్రం వెలుగులోకి వచ్చి పోలీసులను షాక్ కి గురి చేశాయి. తిరువల్లకు చెందిన భగత్ సింగ్ అతని భార్య లైలాకు పద్మను అప్పగిస్తే చివరికి నరబలి ఇచ్చినట్లు నిజాలను ఒప్పుకున్నాడు. అదే సమయంలో గతంలో కూడా రోస్లీ అనే మహిళను ఇలాగే నరబలి ఇచ్చినట్లు షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు. కాగా సదరు దంపతులను అరెస్టు చేసి విచారించగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన దంపతులు ధనవంతులు కావడానికి ఇక ఒక తాంత్రికుడు మాటలు నమ్మి ఇలాంటిది చేసినట్లు తెలిసింది. తాంత్రికుడు చెప్పినట్లు నరబలి ఇచ్చిన ధనవంతులు కాకపోవడంతో మరోసారిప్రయత్నించి ఇక పద్మాను నరబలి ఇచ్చినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి