అవును, మీరు ఇక్కడ విన్నది నిజమే. ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురీ ఆసుపత్రిలో జరిగినట్టు సమాచారం. అక్కడి వైద్యుడు ఇచ్చిన ఇంజెక్ష వికటించి ఓ బాలిక చనిపోయింది. తరువాత ఈ విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందో అని అనుమానం వచ్చిన ఆ ఆసుపత్రి సిబ్బంది చడీచప్పుడు లేకుండా ఆమెను ఆసుపత్రి బయట పదేశారు. కాగా ఈ అమానవీయ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వెంటనే దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే అక్కడ స్థానికంగా 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల వయస్సు గల భారతికి జ్వరం రావడంతో మంగళవారం స్థానిక రాధాస్వామి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. బుధవారం కూడా ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని బంధువులు తెలిపారు. అయితే డాక్టరు ఇంజెక్షను ఇచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి దిగజారినట్లు ఆరోపించారు. ఆ దశలో.. తాము ఏమీ చేయలేమని, వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని సిబ్బంది చెప్పారన్నారు. కానీ, అప్పటికే తమ బిడ్డ మృతిచెందిందని వాపోయారు.

అయితే ఈ విషయం బయటకు తెలిస్తే ఎక్కడ తమకు ఇబ్బంది వుంటుందో అని భావించిన డాక్టర్ మరియు సిబ్బంది ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని ఆసుపత్రి బయట ఉన్న బైక్‌ మీద పడేసి సిబ్బంది విసురుగా వెళ్లిపోయారని మృతురాలి కుటుంబం మీడియా వేదికగా తమ గొడుని వెల్ల్బుచ్చుతోంది. ఆసుపత్రి బయట బైకుపై బాలిక మృతదేహం పడున్న దృశ్యాలు వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. మైన్‌పురీ ఘటనపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆరోపణలు వచ్చిన ఆసుపత్రిని సీజ్‌ చేశామని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఈ సందర్బంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: