మహిళలపై దాడులకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మాత్రం ఆగడం లేదు రోజురోజుకు మహిళలపై ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక మహిళపై అఘాయిత్యం జరగడం  మనం చూస్తూనే ఉన్నాం నవంబర్ 27న తెలంగాణలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దేశమంతా దిశ పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ఉంది.

 

అందరూ నిందితులకు కఠినంగా ఉరిశిక్ష వేయాలంటూ ర్యాలీలు చేస్తూనే ఉన్నారు కానీ మొదట  ఆడవాళ్లకు రక్షణ ఇవ్వాల్సింది  కుటుంబ సభ్యులే అలాంటి కుటుంబ సభ్యులే  అఘాయిత్యం.. పాల్పడుతున్నారు ఇటీవలే కర్నూలు జిల్లాలో కన్న కూతురిపై తండ్రి చేసిన అఘాయిత్యం గురించి విన్నాముఅదే విదంగా  ఇప్పుడు  ఏకంగా ఒక భర్త తన భార్య కు ఏ భర్త చేయని విదంగా  చేసాడు.తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దిశ ఘటన మరవకముందే తాళికట్టిన భార్యను తన స్నేహితులతోపాటు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

 

 అనంతపురం జిల్లా కదిరికి చెందిన మల్లేశ్ తాళికట్టిన భార్య అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. మాంగళ్య బంధాన్ని తుంగలో తొక్కాడు..భార్య కాళ్లు చేతులు కట్టేసి తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. మద్యం మత్తులో తన కలిసి తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  భార్య కాళ్లు చేతులు కట్టేసి తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. 


ఇకపోతే ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త మల్లేశ్ గతంలో తొమ్మిదేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మల్లేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.  నిత్యం మద్యం తాగుతూ మానవ మృగంలా మారాడు  ..నలుగురు మానవ మృగాలు ఆ మహిళపై దారుణంగా ప్రవర్తించడంతో ఆమె ఆస్పత్రిపాలైంది. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రి లో చికిత్స పొందుతుంది ...ఇటువంటి మృగాలను ఉరి శిక్ష వేస్తె నే ఈ సమాజం బాగుపడుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: