కాలేజీలు ఇంకా యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకటించడం జరిగింది.వీటి కోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. ఇక ఈశాన్య ప్రాంత స్టూడెంట్స్ కు ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్‌షిప్‌ (యూజీసీ ఇషాన్ ఉదయ్ లేదా యూజీసీ ఎన్ఈఆర్)అలాగే ఒంటరి బాలికలకు పీజీ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్స్ (యూజీసీ సింగిల్ గర్ల్ ఛైల్డ్ స్కాలర్‌షిప్), ఇక అలాగే ర్యాంక్ హోల్డర్ల కోసం పీజీ స్కాలర్‌షిప్‌ ఇంకా ప్రొఫెషనల్ కోర్సులను చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ స్కాలర్‌షిప్‌ లాంటి  పథకాలను యూజీసీ అమలు చేయడం జరుగుతుంది. ఇక జాతీయ స్కాలర్‌షిప్‌(NSP) పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్ సైట్ ద్వారా అర్హత గల విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాల్సిందిగా యూజీసీ కోరడం జరిగింది.

ఇక ఈ స్కాలర్ షిప్స్ కి సంబంధించిన అర్హత ఇంకా స్కాలర్‌షిప్‌ మొత్తం గురించి ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.యూజీసీ ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్‌ విషయానికి వస్తే..ఈ స్కాలర్‌షిప్‌ను స్పెషల్ గా దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రారంభించడం జరిగింది. ఇక 2014-15 విద్యాసంవత్సరం నుంచి ఈ ఉపకార వేతనం అందిస్తున్నారు.ఇక ప్రస్తుతం నేషనల్ స్కాలర్‌షిప్‌ పోర్టల్ లో దరఖాస్తులు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్‌ ద్వారా ఈశాన్య ప్రాంత విద్యార్థులకు చాలా ఎక్కువ అవకాశాలు అనేవి కల్పించడం అలాగే స్థూల నమోదు నిష్పత్తి(GER) పెంచడంపై యూజీసీ దృష్టిసారించడం జరుగుతుంది. ఇక ఈ పథకం కింద మొత్తం 10 వేల మందికి ఉపకార వేతనాలను అందించడం జరిగుతుంది.ఇక జనరల్ డిగ్రీ కోర్సుల వారి విషయానికి వస్తే.. వారికి నెలకు రూ.5,400, టెక్నికల్ ఇంకా ప్రొఫెషనల్ అలాగే పారామెడికల్ కోర్సులు చదివేవారికి రూ.7,800 అందజేయడం జరుగుతుంది. ఇక వీటి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి నవంబరు 30.

మరింత సమాచారం తెలుసుకోండి: