ప్రస్తుతం కరోనా దేశంలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కేసులు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటం అంటే కేవలం మాస్కులు ధరించడం, సామాజిక దూరం మాత్రమే పాటించడం కాదు ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకుంటే కరోనా తగ్గే అవకాశం వుంది.ఇక కరోనా తగ్గాలంటే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి కావాలి. రోగ నిరోధక శక్తి కోసం ఖచ్చితంగా హెర్బల్ టీని చేసుకొని తాగండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.ఇది ఊపిరితీత్తుల్లో ఏర్పడే వైరస్‌తో పోరాడేందుకు శక్తిని శరీరానికి ఇస్తుంది.ఇది జ్వరం, జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

ఇక హెర్బల్ టీ తయారు చెయ్యడానికి కావలసిన పదార్థాలు:


మెంతులు - 1 టీ స్పూన్
దాల్చిన చెక్క - 1
వెల్లులి పాయలు - 3 లేదా 4
అల్లం - చిన్న ముక్క
తులసి ఆకులు - 7 లేదా 8


హెర్బల్ టీ తయారు చేసే విధానం...

ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు లీటర్ల నీళ్లు వేయండి. ఆ తర్వాత అందులో దాల్చిన చెక్క, అల్లం, వెల్లులి పాయలు, తులసి ఆకులు, మెంతులు వేయండి. స్టవ్ వెలిగించి బాగా మరిగించండి. నీరు బాగా మరగడం ప్రారంభమైతే 3 నుంచి 4 నిమిషాలు స్టవ్ మంటను తగ్గించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. బాటిల్‌లో వేసే ముందు ఈ నీటిని వడపోయండి. అంతే హెర్బల్ టీ రెడీ. రోజూ 250 మిల్లీ లీటర్లు హెర్బల్ టీ తాగితే రోగ నిరోధక శక్తికి అదనంగా పవర్ లభిస్తుంది. అయితే, టీని గోరువెచ్చగా తాగాలి. నిమ్మకాయ రసాన్ని కూడా కలపండి. ఇక ఈ ఆరోగ్యకరమైన టీని మీరు ఇంట్లో తయారు చేసుకోండి. రోగ నిరోధక శక్తిని పెంచుకొని కరోనా వ్యాధి నుంచి మిమ్మల్ని కాపాడుకోండి. ఈ టీలో ఉండే తులసి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.అలాగే ఇన్ఫెక్షన్ల నుంచి ముక్తి లభిస్తుంది.ఇక ఈ హెర్బల్ టీని రెండు రోజుల పాటు కూడా నిల్వ ఉంచవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: