ఈ సీజన్లో చాలా మంది కూడా జ్వరాల బారిన పడుతున్నారు. ఈ జ్వరాలు కాస్తా డెంగీగా మారుతున్నాయి. అయితే కొంత మందిలో తగిన చికిత్స తీసుకోగానే అవి తగ్గిపోతున్నాయి.అయితే మరికొంత మందిలో మాత్రం చాలా తీవ్రంగా పరిణమిస్తుంది. రక్త స్రావం, రక్తం చిక్కబడటం, ప్లేట్ లెట్ల పడిపోవడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. డెంగీ జ్వరం వస్తే.. ఒళ్లంతా నొప్పులు, తీవ్రంగా జ్వరం, వణికిపోడం ఇంకా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ జ్వరం వచ్చిన వారిలో ఎక్కువగా ప్లేట్ లెట్ల ఎక్కువగా పడిపోతూంటాయి. ప్లేట్ లెట్ల పడిపోవడం అంటే ఖచ్చితంగా ప్రాణం మీదకి వచ్చినట్టే. అయితే ప్లేట్ లెట్ల సంఖ్య పెంచడానికి కొన్ని రకాల ఆకులు చాలా బాగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెంచడానికి బొప్పాయి ఆకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వీటి రసం కానీ, కషాయం కానీ తాగితే ప్లేట్ లెట్ల కౌంట్ వెంటనే పెరుగుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వీటి రసం తాగడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడమే కాకుండా జ్వరం కూడా ఈజీగా తగ్గుతుంది.


అలాగే వేప ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ వైరల్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి వేప ఆకుల్ని తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల కౌంట్ అనేది ఈజీగా తగ్గుతుంది. వేపాకుల్ని తీసుకొని వాటిని నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల.. ప్లేట్ లేట్ల సంఖ్య పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా ఈజీగా పెరుగుతుంది.అలాగే జామ ఆకుల్లో కూడా యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటి ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జామ ఆకుల్ని తీసుకున్నా ప్లేట్ లెట్లను ఈజీగా పెంచుకోవచ్చు. రెండు గ్లాసుల నీటిలో.. జామ ఆకులు వేసి సగం అయ్యే దాకా మరిగించుకోవాలి.ఇక ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగిలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే.. ప్లేట్ లెట్లను ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా అలాగే డెంగీని కూడా తగ్గించుకోవచ్చు.అయితే ఈ ఆకులతో పాటు డాక్టర్లు ఇచ్చే మందులను కూడా వేసుకుంటే డెంగీని మనం అదుపులోకి తీసుకురావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: