ముఖ్య సంఘటనలు
1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
1989: భారత లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవీ విరమణ.
2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.
2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.
ప్రముఖుల జననాలు..
1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)
1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).
1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.
1938: తాడిపర్తి సుశీలారాణి, రంగస్థల నటి, హరికథ కళాకారిణి.
1946: స్టీవెన్ స్పీల్బెర్గ్, దర్శకుడు.
1947: ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).
1971: బర్ఖాదత్, టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ, సంభాషణల రచయిత.
ప్రముఖుల మరణాలు
1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)
1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)
1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)
2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)
2015: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931).శ్రీరాములు గడ్డి అచ్చయ్య, అచ్చమ్మ దంపతులకు 1931 డిసెంబరు 5 తేదీన బెజవాడలో జన్మించాడు.[1] పన్నెండు సంవత్సరాల వయసులో విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మేవాడు పతనం’ అనే హిందీ నాటకంలో ఓ బాలుని పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశాడు. బి.కాం. చదువుతున్న రోజుల్లో నటుడు కావాలన్న కాంక్ష, నాటకం పట్ల ఉత్సాహాన్ని పెంచుకొన్నాడు. చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించే అభ్యుదయ నాటక ఉత్సవాల్లో ఎస్.ఆర్.ఆర్. కళాశాల పక్షాన ‘మాస్టర్జీ’ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీరాములు ఉత్తమ నటుడిగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.
మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి