♥ జననాలు ♥
✦ 1884: బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు అయిన తారక్నాథ్ దాస్(మ.1958) జన్మించారు.
✦ 1897: గొప్ప కవి, పండితుడు, అవధాని అయిన పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు ఈరోజు జన్మించారు.
✦ 1916: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయిన హెర్బర్ట్ సైమన్(మ.2001) ఈరోజే జన్మించారు.
✦ 1924: వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు అయిన ద్వారం భావనారాయణ రావు(మ.2000) జన్మించారు.
✦ 1939: సుషుమ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు అయిన దస్తగిరి అచ్చుకట్ల చిన్న జన్మించారు.
✦ 1974: తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు అయిన చక్రి(మ.2014) జన్మించారు.
♡ మరణాలు ♡
✦ 1942: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈడ్పుగంటి రాఘవేంద్రరావు(జ.1890) మరణించారు.
✦ 1949: మలయాళ కవి అయిన ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్(జ.1877)మరణించారు.
✦ 1975: దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన కె.ఎ.నీలకంఠ శాస్త్రి(జ.1892) మరణించారు.
✦ 1983: తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవిశ్రీశ్రీ (జ.1910) మరణించారు.
✦ 2010: కవి, రచయిత, చిత్రకారుడు అయిన మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము(జ.1926) మరణించారు.
✷ సంఘటనలు ✷
✦ 1215: ఈరోజు ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, 'మాగ్నా కార్టా ' మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసి చరిత్ర నెలకొల్పాడు.
✦ 1991: ఈరోజు రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి తరలించారు.
✦ 1908: కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్ ను ఈరోజు ప్రారంభించారు.
✦ 1877: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్ ఈరోజు నియమితులయ్యారు.
✦ 1844: 'ఛార్లెస్ గుడ్ ఇయర్ రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి ఈరోజు పేటెంట్ పొందాడు.
✦ 1836: ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవించిన రోజు.
✦ 1808: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యి బాధ్యతలు చేపట్టాడు.