హార్ట్ ఎటాక్ ఈ మద్యకాలంలో ఎందరినో మట్టిలో కలిపేస్తున్న మాయదారి ఎటాక్ ఇది. ఎందుకంటే ఎవరికైన హార్ట్ ఎటాక్ సంభవించినప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తరలించాలి. అప్పుడే ప్రాణాపాయం నుండి తప్పించుకునే వీలు కలుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో బాధితులను హాస్పిటల్‌కు తరలించడం ఆలస్యం అవుతుంటుంది. అందువల్ల సకాలంలో చికిత్సనందించడం కుదరదు.


ఈ క్రమంలో రోగి హార్ట్ ఎటాక్‌తో చనిపోతాడు. అయితే ఇకపై ఆ బాధ ఉండబోదు. అంటున్నారు. ఎందుకంటే హార్ట్ ఎటాక్‌తో ఇకపై ఎవరైనా చనిపోయినా.. వారిని బతికించేందుకు వీలు కలుగుతుందట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే అంటున్నారు పరిశోధకులు. ఇకపోతే గుండె జబ్బులను నివారించడంలో తాజాగా అద్భుతమైన విజయం సాధించారు కేంబ్రిడ్జి పరిశోధకులు.  హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయిన గుండె రక్తనాళాలు, గుండె కణజాలానికి వారు తిరిగి ప్రాణం పోశారు.


గుండెపోటు వచ్చినప్పుడు సహజంగానే గుండె కణజాలానికి ఆక్సిజన్ అందదు. దీంతో గుండెలోని కొన్ని ప్రాంతాలు దెబ్బ తింటాయి. అక్కడి కణజాలం నాశనమవుతుంది. తిరిగి అది పునర్నిర్మాణం చెందలేదు. దీంతో వ్యక్తి చనిపోతాడు. అయితే ఆ నాశనమయ్యే కణజాలానికి సైంటిస్టులు జీవం పోశారు. ఈ పరిశోధన విధానంలో కేంబ్రిడ్జి పరిశోధకులు మానవ గుండెలో నుంచి రెండు రకాల స్టెమ్ సెల్స్‌ను తీసుకుని వాటిని ఎలుకలలోని చనిపోయిన గుండె కణజాలంలోకి ఎక్కించారు. అనంతరం వాటిని ల్యాబ్‌లో పెంచారు. ఈ క్రమంలో పెరిగిన కణజాలాన్ని తీసుకెళ్లి తిరిగి ఎలుక గుండెల్లోకి ఎక్కించారు.


అయితే ఆశ్చర్యంగా అప్పటికే చనిపోయిన ఎలుకల గుండెలోని కణజాలం తిరిగి జీవం పోసుకుంది. దీంతో ఈ ప్రయోగాన్ని మనుషుల గుండెలపై చేయడమే తరువాయి అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక ఈ ప్రయోగం మనుషులపై చేస్తే అది సక్సెస్ అయితే ప్రపంచ చరిత్రలోనే నూతన అధ్యాయానికి తెరతీసినట్లు అవుతుందని అంటున్నారు. ఇంతే కాకుండా గుండె జబ్బుల బాధితులకు ఇది వరమవుతుందనే చెప్పవచ్చు.


ఎందుకంటే గుండెపోటు వల్ల చనిపోయిన గుండె కణజాలాన్ని తిరిగి బతికిస్తారు. దాంతో గుండె తిరిగి పనిచేస్తుంది. అంటే.. చనిపోయిన వారిని బతికించినట్లే అవుతుంది కదా. మరి సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేస్తారో లేదో చూడాలి..! ఒకవేళ ప్రయోగం విజయవంతమైతే ఇక హార్ట్ ఎటాక్ అంటే భయపడవలసిన అవసరం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: