ఇండస్ట్రీ లో అయినా సరే ఎవరికి అయితే బాగా క్రేజ్ ఉంటుందో అందరూ కూడా వారే కావాలని కోరుకోవడం సహజం. నిజానికి ఈ ఫార్ములా సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా పని చేయడంతో పాటు కనిపిస్తూ ఉంటుంది కూడా. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇద్దరు భామలు ఒకదానివెంట మరొకటి పలు బడా సినిమాల చాన్సు లు దక్కించుకుని తమ ఇమేజ్ ని క్రేజ్ ని అంచలంచెలుగా పెంచుకుంటూ పోతన్నారు. అయితే వారిద్దరూ మరెవరో కాదు ఒకరు పూజా హెగ్డే, మరొకరు రష్మిక మందన్న.

ఇప్పటికే అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో వంటి భారీ సక్సెస్ లు సొంతం చేసుకున్న పూజా చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబో సినిమా, ప్రభాస్ రాధే శ్యామ్, తమిళ నటుడు విజయ్ బీస్ట్, అలానే మెగాస్టార్, మెగాపవర్ స్టార్ ల ఆచార్య సినిమాలు ప్రస్తుతం ఉన్నాయి. మరోవైపు ఫస్ట్ మూవీ ఛలో తో సూపర్ హిట్ కొట్టిన రష్మిక, ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప, శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు, హిందీ లో మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాలు చేస్తోంది రష్మిక.

అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు భామల ఖాతాలో త్వరలో చెరొక రెండు బడా సినిమాలు చేరనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆయా సినిమాల దర్శకనిర్మాతలు వీరిని సంప్రదించినట్లు టాక్. నిజానికి అటు పూజా, ఇటు రష్మిక ఇద్దరూ కూడా కెరీర్ పరంగా ఎంతో కష్టపడి వచ్చారని, అందుకే వారికి ఇంత మంచి చాన్సు లు వస్తున్నాయని కొందరు అంటుంటే, మరికొందరేమో అయితే ఆమె లేకపోతే ఈమె వేరే హీరోయిన్స్ అనే వాళ్లే ఇండస్ట్రీలో లేరా రామా అంటూ మరికొందరు వీరిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరూ ఇంకెంత మేర క్రేజ్ దక్కించుకుంటారో చూడాలి ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: