మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమా చేస్తున్నాడు చిరు. మలయాళంలో హిట్టయిన లూసీఫర్ అనే చిత్రానికి ఇది రీమేక్ గా రూపొందుతోంది. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉండనుంది.

 ఒరిజినల్ వెర్షన్ మలయాళం లూసీఫర్ లో ఆ పాత్రను మంజు వారియర్ పోషించగా.. తెలుగులో మాత్రం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం చిరుకి చెల్లెలిగా మరో స్టార్ హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దర్శకుడు రమ్య కృష్ణ తో సంప్రదింపులు జరిపారని, ఆమె కూడా ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగాస్టార్ కి జోడీగా రమ్యకృష్ణ పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 అయినప్పటికీ ఆమె తన కెరీర్ బిగినింగ్ లో 'చక్రవర్తి' అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించింది. ఇక మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలి గా కనిపించబోతోంది రమ్యకృష్ణ. ఇక ఇందుకు సంబంధించి త్వరలోనే చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే ఈ రీమేక్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ కి ఈ రీమేక్ కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ శనివారం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: