ఆయన హఠాత్ మరణం మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. వేటూరి మరణం తర్వాత చిత్ర పరిశ్రమకు అండగా ఉంటారు అనుకున్నా సిరివెన్నెల కూడా కన్నుమూయడంతో ప్రస్తుతం అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సిరివెన్నెల మరణం పై స్పందిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సిరివెన్నెల మరణంపై స్పందించారు.
"తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని.
శ్రీ సీతారామశాస్త్రి గారు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సిరివెన్నెల మరణంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి.
"నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
మిత్రమా. " వి మిస్ యు అంటూ సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.