సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ గా సర్కారు వారి పాట మూవీతో అతి పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లతో కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన మహేష్ బాబు, లేటెస్ట్ సర్కారు వారి పాట తో మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. దానితో ఆయన తదుపరి సినిమాలపై అందరిలో కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నెక్స్ట్ మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ క్రేజీ మూవీ పై మహేష్ బాబు ఫ్యాన్స్ లో మాత్రమే కాదు అటు నార్మల్ ఆడియన్స్ లో సైతం విశేషమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాని ప్రముఖ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించనుండగా మది ఫోటోగ్రఫి అందించనున్నారు. యువ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ నుండి కొన్ని అనివార్య కారణాల వలన పూజా తప్పుకున్నట్లు సమాచారం. ఈ వార్త మూడు రోజులుగా మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో ఆమె నిజంగానే ఈ ప్రాజక్ట్ నుండి తప్పుకున్నట్లు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.

మరోవైపు నిన్న త్రివిక్రమ్, తమిళ నటి ప్రియాంక మోహన్ ని కలిసి ఆమెకు ఈ మూవీ కథ వినిపించినట్లు వినికిడి. ఆమె ఆల్మోస్ట్ పూజా స్థానంలో ఫైనలైజ్ అయినట్లు చెప్తున్నారు మరికొందరు. ఆ విధంగా మహేష్, త్రివిక్రమ్ ల ప్రాజక్ట్ హీరోయిన్ విషయమై పలు వార్తలు ప్రచారం అవుతూ ఉండడంతో పక్కాగా అసలు ఈ మూవీలో పూజా ఉన్నారా లేదా అనేది స్వయంగా యూనిట్ అధికారికంగా ప్రకటించాలని, అప్పటివరకు ఇటువంటివి నమ్మలేం అని అంటున్నారు విశ్లేషకులు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: