అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియమణి తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన పెళ్లయిన కొత్తలో మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది .

ఆ తర్వాత ప్రియమణి అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది . ప్రియమణి తాజాగా నటించిన నారప్ప , భామా కలాపం సినిమాలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణి 'విరాట పర్వం' మూవీ లోఒక కీలక పాత్రలో నటించింది.  ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటించగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జూన్ 17 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా చిత్ర బృందం వరంగల్ లో ఆత్మీయ వేడుక అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రియమణి మాట్లాడుతూ... తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అని, సాయి పల్లవి కి తాను పెద్ద అభిమానిని అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. విరాట పర్వం మూవీ లో తను భారతక్క పాత్రలో నటించానని, ఈ మూవీ లో తనకు రానాతో ఎక్కువగా సీన్ లు ఉన్నాయని ప్రియమణి తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి వేణు  ఉడుగుల దర్శకత్వం వహించాడు. ఈ మూవీని దర్శకుడు వేణు ఉడుగుల నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: