పూరీ జగన్నాథ్ మొన్నటి దాకా
బాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే ఆయన తదుపరి సినిమాలు చేస్తానని అందరూ అనుకున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఆయన సినిమాలు గతంలో నిర్మించినప్పటికీ ఇప్పుడు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూ ఉండడంతో
ముంబై కేంద్రంగా తన సినిమాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా
పూరి జగన్నాథ్ గత
సినిమా లైగర్ ముంబైలో రూపొంది భారీ స్థాయిలో విడుదల అయ్యింది.
ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో తదుపరి సినిమాను హైదరాబాదులోనే చేసే విధంగా ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికోసం
ముంబై నుంచి
హైదరాబాద్ కు షిఫ్ట్ కాబోతున్నాడట.
రామ్ హీరోగా ఆయన రూపొందించిన
ఇస్మార్ట్ శంకర్ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సీక్వెల్ ను రూపొందించడానికి ఆయన
హైదరాబాద్ కు రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన చేయబోయే తదుపరి
సినిమా ఇదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ
సినిమా తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్టు జనగణమన సినిమాను చేయాలని భావించాడు అయితే దానికి కొన్ని రోజుల వరకు బ్రేక్ వేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబుతో ఆయన
సినిమా చేయడానికి ప్రయత్నాలు చేయగా దానిని ఆల్మోస్ట్ ఓకే చేసిన మహేష్ బాబు ఎందుకో మధ్యలో ఉన్న క్యాన్సల్ చేశాడు. ఈసారి
విజయ్ దేవరకొండ తో చేయాలని అనుకొని దానిని ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లిన కూడా అది మధ్యలోనే ఆగిపోవడం ఆయన ఎంతగానో నిరాశ పరుస్తుంది. మరి ఈ
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సినిమాతో ఘనవిజయం సాధించి ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అనేది చూడాలి. అది కూడా ఈ
హీరో తోనే చేస్తాడా లేదా మరో
హీరో తో ఆ
సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.