బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తాజాగా ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి రెడీ అయింది.  ఇందులో భాగంగానే తనకి సంబంధించిన రకాల వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే శిఖర్ పహారియాతో గత కొంతకాలంగా జాహ్నవి కపూర్ ప్రేమలో ఉంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు చాలా సార్లు వీరిద్దరూ కలిసి

 కనిపించారు. అయితే వీరిద్దరూ గత కొద్దికొద్ది రోజుల క్రితం తిరుపతికి కూడా కలిసే వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే తిరుపతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఈ వార్త కాస్త జాన్వి కంట పడింది .దీంతో ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలకి ఫుల్స్టాప్ పెట్టారు జాన్వి కపూర్. ఇందులో భాగంగానే ఆమె స్పందిస్తూ తిరుపతిలో జాహ్నవి కపూర్ శిఖర్  వివాహం జరగబోతుంది అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక దానికి జాన్వీ కపూర్ స్పందిస్తూ..

 "కుచ్ భీ" అని ఒక పోస్ట్ ని షేర్ చేశారు. అయితే ఏదైనా రాసేస్తారా అని అర్థంతో ఆమె ఇలాంటి కామెంట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జాన్వి కపూర్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని స్పష్టం అవుతుంది. కాఫీ విత్ కరణ్‌ షో లో జాన్వి తన చెల్లి ఖుషి తో కలిసి పాల్గొంది. ఇందులో తన స్పీడ్ డైల్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయి అనే ప్రశ్నకు జాన్వీ బదులిస్తూ.. తన తండ్రి, చెల్లి తో పాటు శిఖర్ పేరును కూడా వివరించింది. అలాగే ఇటీవల ముంబైలో మైదాన్ సినిమా ప్రీమియర్‌కు జాన్వి కపూర్ హాజరై సందడి చేసింది. ఈ ఈవెంట్ లో వైట్ డ్రెస్ ధరించి ముద్దుగా కనిపించిన జాన్వి.. శిఖు అని పేరు ఉండే చేను ధరించి అందర్నీ ఆకట్టుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: