జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రచారంలో భాగంగా హద్దులు మీరి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిందని నిన్నటి రోజున రాత్రి ఆయన చంద్రబాబుతో కలిసి తిరుపతి రోడ్డు షోలో సభ ప్రసంగంలో ఏవేవో మాటలు మాట్లాడారు.. ముఖ్యంగా అలిపిరిలో చంద్రబాబు మీద జరిగిన సంఘటన గుర్తుకు చేస్తూ మందు పాత్రలు దాటికి చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు 15 అడుగుల పైకి ఎగిరి కింద పడిందని.. అలాంటి వాటిని తట్టుకొని బతికిన ధీరుడు చంద్రబాబు అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు..


అలాగే తిరుపతి వెళ్ళిన భూమా కరుణాకర్ రెడ్డి కోడి బొచ్చు అమ్ముకొని నెలకు 20 లక్షలు సంపాదిస్తున్నారు అంటూ ఏవేవో పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏడుకొండలు కాదు రెండు కొండలే ఉన్నాయని వైయస్సార్ అనడం వల్లే ఆయన గాలిలో కలిసిపోయారని మాటలు మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. ఇన్ని రోజులు తిరుమల నిధులను అభివృద్ధి పనులకు ఎలా ఉపయోగిస్తారు అంటూ విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. కూటమి అధికారంలోకి వస్తే టిడిపి అభివృద్ధి చేయడానికి చాలా ఖర్చు పెడతామంటూ విడ్డూరంగా చెబుతున్నారు..


ఎన్నికలలో ఓటర్లకు వైసీపీ పార్టీ ఇచ్చే 2000 రూపాయలు అది టిడిపి సొమ్మని దాన్ని తీసుకెళ్లి తిరుపతి హుండీలో వేయాలంటూ పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిస్తున్నారు.. ఇలా ఏదో తికమొక్క మాటలతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ని చూసి కూటమి నేతలు కార్యకర్తలు కూడా కాస్త విసుక్కుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతిలోనే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రతి సభలో కూడా ఏదో రకంగా మాట్లాడుతున్నారని అభిప్రాయం కూటమిలో మొదలవుతోంది... కూటమి మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని మాట్లాడకుండా కేవలం చంద్రబాబును పొగుడుతూ వైసిపి వైసిపి కుటుంబాన్ని తిడుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అతివాగుడు వల్ల కూటమికి దెబ్బ పడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: