జూనియర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ చరణ్‌- రాజమౌళి త్రయంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళిని ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఫేమస్ చేసిన చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. ఈ మూవీ విజయంతో రాజమౌళికి హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుతోనూ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి రీరిలీజ్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో అన్న అంచనాలు పెరిగాయి. అయితే చరణ్‌..తారక్ పాత్రల వ్యత్యాసంపై తెలుగు రాష్ట్రాల నంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లు వెత్తిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పాత్రతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తక్కువ గా ఉందని...ధీటుగా లేదని యంగ్ టైగర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మొదటి షోతోనే ఈ రగడ ఏపీ..తెలంగాణలో మొదలైంది. తొలి షో తరువాత కొన్ని థియేటర్లని ధ్వంసం చేయడం జరిగింది. ఎన్టీఆర్ పాత్రని హైలైట్ చేయడంలో రాజమౌళి విఫలమయ్యారని... అందుకు సమాధానం చెప్పాలంటూ అభిమానుల నుంచి భారీగా డిమాండ్ వ్యక్తంమైంది.


అయితే దీనిపై రాజమౌళిగానీ ఇంకా తారక్ గానీ ఎక్కడా కూడా స్పందించలేదు. అభిమానుల ఆగ్రహం తరువాత తారక్ మాత్రం రాజమౌళి పై అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఇదంతా కూడా గతం. అభిమానులు సహా ఎన్టీఆర్ కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా సూటిగా మీడియానే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఓ హీరో రోల్ ఎక్కువగానూ..మరో హీరో పాత్ర తక్కువగానూ చూపించారని బాహుబలి యానిమేషన్ సిరీస్ ప్రెస్ మీట్ లో అడగడం జరిగింది.కానీ దాని గురించి అసలు రాజమౌళి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇది సరైన వేదిక కాదంటూ దానిని స్కిప్ కొట్టారు. ఇంత గ్యాప్ వచ్చినా కూడా రాజమౌళి దీని గురించి స్పందిచకపోవడం వెనుక కారణం ఏంటి? ఎస్ ఎస్ రాజమౌళి అనుకుంటోన్న ఆ సరైన సమయం ఎప్పుడు? అసలు ఎందుకు మౌనం వహించాల్సి వస్తోంది? అంటూ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పక్కన పెడితే మహేష్ బాబుతో చేసే సినిమాతో రాజమౌళి ఫ్యాన్స్ ని నొప్పించే విధంగా తప్పులు చెయ్యరట. ఈ సినిమాలో మహేష్ ని ఒక రేంజ్ లో చూపిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR