ప్రీతి జింటా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో రెండు ల్లోనే నటించినా అప్పట్లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రాజకుమారుడు తో తెలుగు తెరకు పరిచయమైన ఈ సొట్టబుగ్లల సుందరి.ఆ తర్వాత వెంకీ జోడిగా ప్రేమంటే ఇదేరా లో కనిపించింది. ఈ రెండు చిత్రాల తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది ప్రీతి. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ లు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని లకు దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సహ యాజమానిగా వ్యవహరిస్తుంది. మరోవైపు ల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. తెలుగులో మంచి కథ వస్తే చేసేందుకు రెడీగా ఉన్నానంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే.. హిందీలో అనేక ల్లో నటించిన ప్రీతిజింటా.. ఓ మూవీ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురై కాలు విరగొట్టుకుందట. ఈ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుంది. 1999లో విడుదలైన సంఘర్ష్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో అక్షయ్ కుమార్, అమన్ వర్మ, ప్రీతిజింటా, అశుతోష్ రానా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా.. ప్రీతిజింటా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె కాలు విరిగింది. అలాగే పళ్లు కూడా విరిగిపోయాయి. అలాగే పెదవులు తెగి రక్తం కూడా వచ్చిందట. కష్టమైనా సరే ఆ యాక్షన్ సీన్ కంప్లీట్ చేశాకే స్థానిక ఆసుపత్రికి వెళ్లినట్లు ప్రీతిజింటా చెప్పుకొచ్చింది. ఈ మూవీ విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో తన కష్టమంతా మర్చిపోయానని తెలిపింది.ఇటీవల ప్రీతి ఖాతాలో లైవ్ చాట్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో సంఘర్ష్ షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న కష్టమైన రోజులను గుర్తుచేసుకుంది. ఆ మూవీ షూట్ సమయంలో తన కాలు, పళ్లు విరిగిపోయాయని తెలిపింది. పెదవులు కోసుకుపోవడంతో కష్టంగా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: