నేను శైలజా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మలయాళంలో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు తెలుగులోనే మంచి గుర్తింపు లభించింది. నేను శైలజా తరువాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చేసినా కలిసిరాలేదు. అదే సమయంలో అనుకోకుండా మహానటి ఆఫర్ వచ్చింది. కెరీర్ స్టార్టింగ్లోనే అలాంటి సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకుంది. మహానటి తర్వాత తెలుగులో మన్మథుడు-2 సినిమాలో మాత్రమే కీర్తి సురేష్ నటించింది. ఐతే అందులో గెస్ట్ రోల్కే ఆమె పరిమితమైంది. మరి కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ఏంటో తెలిసిపోయింది. మొన్నటి వరకు మహానటిగా మెప్పించిన కీర్తి..త్వరలో మిస్ ఇండియా మన ముందుకు రాబోతోంది.
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తూ రావడంతో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న ఆమె, ఆ తరువాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రానా సినిమాలోనూ చేయడానికి 'నో' చెప్పేసిందట. రానా హీరోగా ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అట. ఈ సినిమా తెలుగు రైట్స్ ను తీసుకున్నది రానానే. ఆయన జోడీగా కీర్తి సురేశ్ ను సంప్రదించగా ఆమె 'నో' చెప్పేసిందట. దీనికి కారణం, ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది తెలియరాలేదు. దీంతో ఇప్పుడు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట. ఏది ఏమైన కీర్తి క్రేజ్ వేరు. అయిన కథలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తది. మంచి కథలను ఎన్నుకుంటూ తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుని అతి జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.