టాలీవుడ్ యూత్ సెన్సేషన్
విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయమై ఆయన ఎంతో ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న ఈ రౌడీ హీరో, త్వరలో పూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తొలిసారి
విజయ్ దేవరకొండ, కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం, ఆ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా
తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' అనే ఒక వినూత్న సినిమాను ప్రారంభించడం జరిగింది. కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో
అనసూయ భరద్వాజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుండగా, అభినవ్ గోమటం,
వాణి భోజన్,
పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్,
వినయ్ వర్మలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే నేడు టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచితనం పేరుతో గొప్పలకు పోయి అనుకోకుండా ఒక చిన్న సమస్యను మరింత పెద్దదిగా చేసుకున్న ఒక యువకుడు, తన మిత్రులతో కలిసి ఏ విధంగా ఆ సమస్యను ఎదుర్కొని చివరకు బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. ఇక తన తొలి సినిమా దర్శకుడైన
తరుణ్ భాస్కర్ ని
విజయ్ హీరోగా ఎంచుకుని మంచి పనే చేసారనే చెప్పాలి. ట్రైలర్ లో
తరుణ్ పలికిన ఫన్నీ డైలాగ్స్ ఎంతో బాగున్నాయి. ఇక నటి
వాణి భోజన్ సహా మిగతా నటీనటులు అందరూ కూడా ట్రైలర్ లో తమ మార్క్ పెర్ఫార్మన్స్ తో బాగానే చేసారు.
ఇకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మంచి ఎంటర్టైనింగ్ డైలాగ్స్, ఛేజింగ్ సీన్స్ తో అలరించిన ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత, సినిమాపై అమాంతం అంచనాలు పెరిగాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది.
శివ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ట్రైలర్ ఎంతో ఫన్నీగా బాగుందని, సినిమా యూనిట్ కి
మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెల్పడం జరిగింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ పై ఒక లుక్ వేయండి..!!