‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీ తరువాత అమలకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలు అన్నింటిని అమల తిరస్కరించింది. అయితే ఇప్పుడు ఆమె అనూహ్యంగా ఒక తల్లి పాత్ర నచ్చి శర్వానంద్ కు తల్లిగా నటిస్తూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. శర్వానంద్ రీతు వర్మలు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీలో అమల శర్వానంద్ తల్లిగా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర ఈ మూవీలో అమల భర్తగా శర్వానంద్ తండ్రిగా నటిస్తున్నాడు. స్నేహం ప్రేమ నేపధ్యంలో సాగే ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో అమల పాత్ర కీలకమే కాకుండా మొత్తం కథ అంతా ఈమె చుట్టూ తిరుగుతుందని సమాచారం. 

యంగ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగు తమిళ భాషలలో సంచలనం సృష్టించిన ‘ఖైదీ’ మూవీ నిర్మాతలు నిర్మిస్తున్నారు. గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమైపోతున్న శర్వానంద్ సరైన హిట్ కోసం విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. దీనితో అతడు నటించే సినిమా కథల ఎంపికలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

శర్వానంద్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీలో అమల తల్లి పాత్రలో కనిపిస్తే ఈ మూవీ ప్రాజెక్ట్ కు చాల క్రేజ్ వస్తుందని భావించి శర్వానంద్ స్వయంగా రంగంలోకి దిగి అమలను ఈ పాత్రలో నటించేలా నాగార్జున పై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు టాక్. యంగ్ హీరోలలో వివాదాలకు దూరంగా ఉండే శర్వానంద్ పై టాప్ హీరోలు అందరికీ ముఖ్యంగా నాగార్జునకు మంచి అభిప్రాయం ఉండటంతో శర్వానంద్ వ్యూహం ఫలించింది అని అంటున్నారు. ఈ మూవీని ఒకేసారి తెలుగు తమిళ భాషలలో నిర్మిస్తున్న పరిస్థితులలో శర్వానంద్ చాల వ్యూహాత్మకంగా కోలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు అని అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: