టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం చివరిదశ షూటింగ్ ని జరుపుకుంటోంది. మహేష్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న తొలిసారి నటిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ మరియు రష్మిక మధ్య వచ్చే రొమాంటిక్ మరియు కామెడీ సీన్స్ ఈ సినిమాలో ఎంతో అదిరిపోతాయని, అలానే సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యాన్స్ కు కావలసిన అన్ని రకాల మాస్ మరియు కమర్షియల్ అంశాలు ఉండనున్నట్లు టాక్. 

ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపుతున్న ఈ సినిమాలో ఒకప్పటి నటి విజయశాంతి ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, రావు రమేష్, రఘుబాబు, హరితేజ, సంగీత, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావట. అయితే ఆమె పాట్లు ఎందుకోసమంటే, మహేష్ ప్రక్కన నటించడానికట. చూడడానికి హాలీవుడ్ హీరోలా ఎంతో అందంగా ఉండే మహేష్ బాబు ముందు, ఎంతటి అందగత్తైన హీరోయిన్ నిలబడినా సరే ఆయన అందం ముందు ఇట్టే తేలిపోతారనే చెప్పాలి. ఇక రష్మిక కూడా మిగతా హీరోయిన్స్ మాదిరి మహేష్ ని డామినేట్ చేసేందుకు ఎంతో అందంగా మేకప్ చేసుకుని షూటింగ్ చేసిందట. 

ఇక కొన్ని సీన్స్ లో ట్రెడిషినల్ డ్రెస్ లంగావోణీలో ఎంతో అందంగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ, తన ఆకట్టుకునే అందంతో మహేష్ ని డామినేట్ చేసే ప్రయత్నం మాత్రం బాగానే చేసిందని అంటున్నారు. వాస్తవానికి ఎంతో అందగత్తె అయిన రష్మికకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి స్క్రీన్ పై మహేష్ ని ఎంతవరకు ఈ భామ తన అందంతో డామినేట్ చేసిందో తెలియాలంటే మాత్రం 2020 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: