ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలు బాక్సింగ్ ఆఫీసు ప్రదర్శన విషయానికి వస్తే ఆశాజనకంగా లేవు. రోబో తరువాత, బాక్స్ ఆఫీస్ దగ్గర రజిని ఏ చిత్రం కూడా మంచి ఫలితాలను ఇవ్వ లేదు. రజిని చివరి చిత్రం పేటాకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో తగినంత థియేటర్లు లేకపోవడం, ఆ చిత్ర కలెక్షన్ల ప్రవాహానికి ఆటంకం కలిగించాయి. దీనితో రజినీ యొక్క తాజా చిత్రం దర్బార్ తక్కువ అంచనాలను కలిగి ఉంది. తెలుగు మీడియా కూడా ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల కాబోయే భారీ బడ్జెట్ చిత్రాలైన అలా వైకుంఠ పురంలో , సరిలేరు నీకెవ్వరూ చిత్రాలకు పోటీగా భావించలేదు. దర్బార్ చిత్ర ట్రైలర్ విడుదల తర్వాత పరిస్థితులు ఒక్క సరిగా మారిపోయాయి.
దర్బార్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలను కలిగి వుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్లస్ స్టోరీ పొలిసు పాత్ర నేపథ్యంలో నడుస్తుంది, పొలిసు కథ నేపధ్యంగా ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయాన్ని సాధించాయి. రజని మానియా ఈ చిత్రం లో కనిపిస్తుంది. థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై సరైన అంచనాలను నెలకొల్పింది. ట్రేడ్ ఎనలిస్టులు మహేష్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలకు , రజిని దర్బార్ గట్టి పోటీని ఇవ్వబోతుందని భావిస్తున్నారు.
తెలుగు సినిమా వ్యాపారానికి గుండెగా భావించే నిజాం ప్రాంతంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నందున ఈసారి ఈ చిత్రానికి థియేటర్ల సమస్య ఉండదు. ఎ.ఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సునీల్ శెట్టి విలన్ పాత్రలో కనిపిస్తారు. దర్బార్ చిత్రం జనవరి 9 లేక 10 న విడుదల అవుతుంది, త్వరలో ఈ రెండు రోజుల్లో ఎదో ఒక రోజు నిర్ధారించబడుతుంది. జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ , అలా వైకుంఠ పురంలో జనవరి 12 న విడుదల కాబోతున్నాయి.