ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ విజేతగా మారిన అల్లు అర్జున్ సుకుమార్ ల లేటెస్ట్ మూవీ టార్గెట్ మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది కూడ సంక్రాంతికి మహేష్ బన్నీమూవీ ఫైట్ ఉంటుందని భావించారు. దానికి అనుగుణంగానే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే విధంగా మహేష్ వంశీ పైడిపల్లి అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీల విడుదల యాక్షన్ ప్లాన్ ను డిజైన్ చేసారు. 


అయితే అనూహ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోకి ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చి చేరడంతో పాటు మహేష్ వంశీ పైడిపల్లిల  మూవీ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు బన్నీ ఆలోచనలు మారి సుకుమార్ కు కొత్త టార్గెట్ ఇచ్చినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని వేగంగా పూర్తి చేసి ఈ సంవత్సరం దసరా రేసులోకి తీసుకు వచ్చే ఆలోచనలలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. 


దీనితో ఈ సినిమా షూటింగ్ ను వెంటనే ప్రారంభించమని బన్నీ సుకుమార్ పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ఈ సినిమా కథ అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే నేపధ్యంలో మొదట్లో శేషాచలం అడవులలో తీద్దామని భావించారు. అయితే అక్కడి అటవీ అధికారులు అనుమతులను నిరాకరించడంతో ఇప్పుడు హాంకాంగ్ దగ్గర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ చేయడానికి ప్లాన్ మార్చారు. 


ఇప్పుడు కరోనా దెబ్బకు చాల సినిమాల యూనిట్లు అవుట్ డోర్ షూటింగ్ వెళ్ళడానికి భయపడిపోతున్న పరిస్థితులలో కరోనా హడావిడి తగ్గేదాకా కాస్త ఆలస్యం చేద్దాం అని సుకుమార్ చెపుతున్నా బన్నీ పట్టించుకోకుండా ఈ మూవీకి సంబంధించిన హాంకాంగ్ షెడ్యూల్ ను వెంటనే ప్రారంభించమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా నెమ్మదిగా సినిమాలు తీసే సుకుమార్ అల్లు అర్జున్ కొత్త టార్గెట్స్ విషయం తెలుసుకుని చాల టెన్షన్ పడుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: