ఇటీవల థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్లు పెరగడంతో ఎవ్వరూ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్, అమోజాన్ లాంటి సంస్థలు వచ్చేశాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే సినిమా డిజిటల్ రైట్స్ను ఈ సంస్థలు కోట్లు పెట్టి కొనేస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో వెబ్ సీరిస్లకు కూడా డిమాండ్ పెరిగిపోతోంది. పలువురు ఔత్సాహికులు ఈ వెబ్ సీరిస్లతో తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆహా అంటూ ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ను ప్రారంభించిన విషయం తెల్సిందే. అమెజాన్, హాట్స్టార్, నెట్ప్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థల కంటే భిన్నంగా తెలుగు సినిమా రైట్స్ సొంతం చేసుకుని ఇక్కడ లోకల్గా సత్తా చాటాలని ఆహా తెరమీదకు వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు, తెలుగు వెబ్ సీరిస్లు మాత్రమే ఇందులో పెడుతున్నారు. అయితే ఇప్పుడు అరవింద్కు షాక్ ఇచ్చేలా మరో ఓటీటీ వస్తోందట.
టాలీవుడ్ అగ్ర నిర్మాతలే అయిన దిల్ రాజు, సురేష్ బాబు కలిసి మరో రెండు నెలల్లో ఓటీటీ ప్రారంభిచ బోతున్నారట. అరవింద్ ఆహాకు దిమ్మతిరిగేలా వీరు స్కెచ్ గీస్తున్నట్టు టాక్. సురేష్బాబు మరియు దిల్రాజుతో పాటు ఒక వ్యాపార వేత్త కూడా ఇందులో భాగస్వామిగా కూడబోతున్నాడట. వీళ్లు భారీ బడ్జెట్తో వెబ్ సీరిస్లు నిర్మించడంతో పాటు పలు చిన్న సినిమాలను రిలీజ్కు ముందే డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుని తమ ఓటీటీలో ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఓటీటీ కూడా ప్రారంభమైతే అరవింద్ ఆహాకు పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.