తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ప్రపంచం నలుమూలలా పాకిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ లో అయితే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బాహుబలి తర్వాత చేసిన సాహో మూవీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైనది . కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది సాహో మూవీ. టాలీవుడ్ లో ఈ సినిమాకి అంతగా వసూలు రానప్పటికీ బాలీవుడ్లో మాత్రం దూసుకుపోయింది సినిమా. 

 

 భారీ వసూళ్లు కూడా రాబట్టింది. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉండడంతో బాలీవుడ్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది సాహో సినిమా. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ నిర్మాణాత్మక విలువల పరంగా మాత్రం సాహో సినిమా టాప్ ప్లేస్ లో నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ గానే  రూపొందుతోంది. ఈ సినిమా విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న సమాచారం. అయితే సాహో అంత లేకపోయినా ఈ సినిమాకు కూడా భారీ రేంజ్ లోనే నిర్మాతలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అటు ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో చాలా డిమాండ్ కూడా ఏర్పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. 

 


 ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక మార్కెట్ సెట్  వేశారని. ఈ మార్కెట్ వేయడానికి ఏకంగా రెండు వేల రూపాయలు ఖర్చు చేశారు అంటూ ఓ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. అంతేకాదు పది రోజుల పాటు 150 మంది కష్టపడి ఈ మార్కెట్ సెట్  వేశారట. మరి ఈ రెండు కోట్ల తో వేసిన మార్కెట్ సెట్  లో షూటింగ్ చేసింది ఎన్ని రోజులు అనుకుంటున్నారా... కేవలం రెండు రోజులు మాత్రమే. రెండు రోజుల కోసం రెండు కోట్ల సెట్ వెసారట . అయితే ఈ మార్కెట్ లో ప్రభాస్ గుండాలను తరుముతూ  చాలా సేపు పరిగెడుతూ ఉంటాడని... ఆ సీన్ ఎంతో బాగుంటుంది అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: