ప్రస్తుతం ఈ ఛానల్ పెట్టినా సరే సీరియల్ కనిపిస్తూ ఉంటుంది. సరే వచ్చే సీరియల్ ఏమైనా కాస్త నవ్వులు పంచుతుంద అంటే అబ్బే అలా ఎలా... బాగా రంగరించి ఎమోషన్ మొత్తం దట్టిస్తూ ఉంటారు సీరియళ్లలో. టన్నుల టన్నుల కొద్దీ ఎమోషన్ ఉంటుంది నేటి తరం సీరియళ్లలో . ఎప్పుడు ఏడుపు గొట్టు సీన్లు. ఇలా ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ హవా నడుస్తోంది. ఇక ఈ ఏడు కొత్తగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ సీరియల్ వస్తే బాగుండు అనుకున్నప్పటికీ అలాంటివేవీ రాకపోవడంతో... టన్నుల టన్నుల ఎమోషనల్ ఫీల్ అయితే ఈ సీరియళ్ళని చూస్తున్నారు. ఇలా ఏడుపు గొట్టు సీరియళ్లు వస్తున్న కాలంలో.. గత కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై సంచలనం సృష్టించింది అమృతం సీరియల్. ఎలాంటి ప్రేక్షకుడినైనా కడుపుబ్బ నవ్వించే హాస్యంతో బుల్లితెరపై సంచలనమే సృష్టించింది అని చెప్పాలి.
ఇక అమృతం సీరియల్ కి ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినా ప్రజలకు మాత్రం ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇక ఇంకొన్ని రోజుల్లో అమృతం సీరియల్ సీక్వెల్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతుంది. ఇక తాజాగా ఈ సీరియల్ పై టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తనదైన శైలిలో స్పందించారు. 19 ఏళ్ల కిందట కంటతడిపెట్టించే సీరియల్ రాజ్యమేలుతున్న కాలం లో... సీరియల్ అంటే ఎమోషన్ మాత్రమే కాదు ఇలా కూడా ఉండొచ్చు అని... రంగంలోకి దిగిన ఒకే ఒక్కడు అమృతం. సీరియల్ అంటే ఇలాగే ఉండాలి ఎమోషన్ టన్నులు టన్నులు ఉండాలి అన్న రూల్స్ తుంగలో తొక్కి.. అమృతం సాగించిన కామెడీ ఐదుసార్లు రిపీట్ అయినా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అంతేకాకుండా 270 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఒకే ఒక్క బుల్లితెర సీరియల్ అమృతం.
పాత్రల పరంగా చూస్తే.. ఎప్పటికీ విజయం సాధించని జీరోల్లాంటి అంజి, అమృతంలో పాత్రల నుంచి ఎంతటి విజయవంతమైన సీరియల్ నిర్మించారు కదా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకే ఒక్క సీరియల్ అమృతం. ఈ సీరియల్ కు సీక్వెల్ తీసుకురావాలని ప్రేక్షకుల నుంచి ఎన్నో రోజులుగా అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో అభిమానుల కోరిక తీరునుంది . ఎట్టకేలకు ఉగాది నుంచి అమృతం సీరియల్ ప్రారంభం కాబోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టారు రాజమౌళి.