మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సంవత్సరం ప్రారంభం లోనే సంక్రాంతి బరిలో దిగి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. అటు అల్లు అర్జున్ ఇటు త్రివిక్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఒకరకంగా అల్లు అర్జున్ కి ఈ సినిమా రికార్డ్ సాధించిన సినిమా అని చెప్పాలి. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించేశారు. 

 

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన 'అ' సెంటిమెంట్ ని కొనసాగిస్తూ 'అయినను పోయిరావలె హస్తినకు..' అనే టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ చేశారు. త్రివిక్రమ్ ఈ టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటినుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకముందు ఎన్.టి.ఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులని ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో మళ్ళీ త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీతోం పాటు ప్రేక్షకుల్లోను భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఎన్.టి.ఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ తర్వాత వచ్చే సినిమా కావడం కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచడానికి ఒక కారణం. 

 

అయితే కరోనా కారణంగా తాజాగా నెలకొన్న పరిస్థితుల బట్టి చూస్తే త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయో 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలవడం కష్టం అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అందుకు కారణం కరోనా తో అన్ని సినిమాలకి బ్రేక్ పడ్డట్టుగానే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి బ్రేక్ పడింది. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ షెడ్యూల్ ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దాంతో ఆగస్టు నుంచి అనుకున్న 'అయినను పోయిరావలె హస్తినకు..' సినిమా షూటింగ్ మొదలవదని తాజా సమాచారం. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతానికి వేయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేరని ఈ లోపు స్క్రిప్ట్ ఇంకా పక్కాగా రెడీ చేసుకోవడమే ఆప్షన్ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: