మెగా అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు ఎదో ఒక రగడ క్రియేట్ అవుతూనే ఉంటుంది. తన కట్టే కాలే వరకు తాను చిరంజీవి వీరాభిమానిని అని ఓపెన్ గా అల్లు అర్జున్ ఎన్నిసార్లు చెప్పినా మెగా అభిమానులు పూర్తిగా బన్నీని నమ్మరు. దీనికితోడు బన్నీ తన అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ గా నామకరణం చేయడంతో పాటు ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ హీరోలందరి కలక్షన్ రికార్డులను అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ బ్రేక్ చేయడంతో మెగా అభిమానులలో మాత్రం ఒక అసంతృప్తి ఉంది.


ఈవిషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా మెగా అల్లు ఫ్యామిలీ లు తామంతా ఒకటే అన్న సంకేతాలు ఇస్తూ ఉంటారు. అయితే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఎదో బయట పడని గ్యాప్ ఉంది అంటూ ఒక ప్రచారం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం లాక్ డౌన్ పిరియడ్ లో ఖాళీగా ఉన్న మెగా హీరోలు అంతా కరోనా నుండి జాగ్రత్తగా ఉండండి అంటూ సంకేతాలు ఇచ్చే స్లొగన్స్ తో డిజైన్ చేయబడ్డ మెగా ఫ్యామిలీ ఫోటో గ్రిడ్ లో అల్లు అర్జున్ మిస్ కావడం బన్నీ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. 


మెగా ఫ్యామిలీ హీరోలలో ఇంకా తొలి సినిమా కూడ విడుదల కాని వైష్ణవ్ తేజ్ కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించిన కళ్యాణ్ దేవ్ మొదలుకుని మెగా హీరోలు అంతా ఈ మెగా ఫ్యామిలీ ఫోటో గ్రిడ్ లో కనిపిస్తున్నారు. అంతేకాదు అల్లు అరవింద్ అల్లు శిరీష్ లు కూడ ఈ మెగా ఫోటో గ్రిడ్ లో కనిపిస్తున్న నేపధ్యంలో కేవలం ఒక్క బన్నీని మాత్రమే ఎందుకు పక్కకు పెట్టారు అంటూ బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 


అయితే వ్యూహాత్మకంగా డిజైన్ చేయబడ్డ ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ కూడ కనిపించడం లేదు. దీనితో ఈ విషయం పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో చిరంజీవి నాగబాబు లతో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఉన్న ఈ ఫోటోలో పవన్ కనిపించక పోవడం పై పవన్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ మెగా ఫోటో గ్రిడ్ సాయి తేజ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో సరదాగా ఈ మెగా మేనల్లుడు అత్యుత్సాహంతో చేసిన పని మళ్ళీ మెగా బన్నీ అభిమానుల మధ్య అనుకోకుండా చిచ్చు పెట్టింది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: