తమిళ స్టార్ హీరో విజయ్ మరో సారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇంతకుముందు కరోనా పై పోరుకు కేంద్రం తోపాటు సౌత్ లోని అన్ని రాష్ట్రాలకు  విరాళాలను ప్రకటించిన విజయ్ తాజాగా తన ఫ్యాన్స్ కు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తన అభిమానులకు ఒక్కొక్కరికి, విజయ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయల చొప్పున  వారి బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. ఇందుకోసం విజయ్ మొత్తం 50 లక్షల రూపాయలను  ఖర్చు చేశాడు. విజయ్ చేసిన ఈ పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ 50లక్షల తోకలిపి  విజయ్ ఇప్పటివరకు 1.80 కోట్ల రూపాయలను విరాళం గా ఇచ్చాడు.  
 
ఇక విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఈపాటికే విడుదలకావల్సి ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. జూన్ లేదా జూలై లో మాస్టర్ ను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. వీరితోపాటు ఆండ్రియా , అర్జున్ దాస్ , శాంతన్ భాగ్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: